ట్రాఫిక్ జరిమానాలను భారీగా తగ్గిస్తూ సీఎం సంచలన నిర్ణయం

అహ్మదాబాద్: మోటార్ వెహికల్ చట్టం 2019 అమల్లో భాగంగా విధిస్తున్న ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన జరిమానాల మొత్తాన్ని కొంత మేరకు తగ్గిస్తూ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో జరిమానాలతో బెంబేలెత్తుతున్న గుజరాత్‌లోని వాహనదారులకు కాస్తంత ఊరట లభించినట్లయింది. కొత్తగా అమల్లోకి చట్టం ప్రకారం హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే రూ.1000 చెల్లించాల్సి ఉంది. గుజరాత్‌లో ఈ మొత్తాన్ని రూ.500లకు తగ్గించారు.


కొత్తగా అమల్లోకొచ్చిన జరిమానాల ప్రకారం సీటు బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణం చేస్తే వెయ్యి రూపాయలు చెల్లించాలి. గుజరాత్‌లో అయితే.. రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. నిర్లక్ష్యపూరిత థోరణితో అతి వేగంగా వాహనాన్ని నడిపితే కొత్త ఫైన్స్ ప్రకారం రూ.5000 చెల్లించాల్సి ఉంది.గుజరాత్‌లో ఈ మొత్తాన్ని టూవీలర్‌కు రూ.1500, లైట్ మోటార్ వెహికల్స్‌కు రూ.3000, ఇతర వాహనాలకు రూ.5000 జరిమానాగా నిర్ణయించారు.