యుపిఎ ప్రభుత్వం 2010లో ప్రారంభించిన ఎన్‌పిఆర్ ప్రక్రియను కొనసాగిస్తున్నాము:జి.కిషన్ రెడ్డి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి 

*జి.కిషన్ రెడ్డి కేంద్ర హోం శాఖ సహాయ* *మంత్రి* 



 *ఎన్‌పిఆర్ అనేది ఎన్‌ఆర్‌సికి ముందస్తు* *చర్యల్లో  భాగ మని* *ప్రతిపక్ష పార్టీలు మరియు* *మీడియాలోని  ఒక వర్గం  ఉద్దేశపూర్వక* *చేస్తున్న నిరాధారమైన* *అసత్య  ప్రచారాన్ని* *నేను తీవ్రంగా* *ఖండిస్తున్నాను. రెండింటి మధ్య* *ఎటువంటి సంబంధం లేదని నేను* *ఖరాఖండిగా చెప్పదలచుకున్నాను.*
  ప్రస్తుత ఎన్‌పిఆర్ 2021 లో జరగనున్న జనగణన లో అంతర్భాగం మాత్రమే. ఆ మాటకొస్తే  మేము గత   యుపిఎ ప్రభుత్వం 2010లో ప్రారంభించిన ఎన్‌పిఆర్ ప్రక్రియను కొనసాగిస్తున్నాము, అంతే. కాకపోతో మూడునాలుగు అదనపు అంశాలు జోడించి వివరాలు సేకరించడం జరుగుతుంది. *
 *ఒక వ్యక్తి యొక్క* తల్లిదండ్రుల *పుట్టిన* *ప్రదేశానికి సంబంధించిన** *వివరాలు, ఆధార్* *కార్డ్ నంబర్ మరియు చివరి* *నివాస స్థలం యన్ పి ఆర్ లో* *పొందుపరచనున్న కనీస ప్రాథమిక* *అంశాలు* . *ఈ విషయం* *లో ప్రతిపక్ష పార్టీలు* *ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని* *సన్నగిల్లేటట్లు చేయడానికిఅపోహలు* *సృష్టించి* *_ప్రజల మనస్సుతో  ఆట_* *ఆడుతున్నాయి* 
. దేశంలో సమర్థవంతంగా అమలవుతున్న  సంక్షేమ ఎజెండాను నిర్వీర్యం చేసి, పేదరిక నిర్మూలనకు సంబంధించిన  ఆయుష్మాన్ భారత్ లాంటి వివిధ పథకాల  అమలు కి విఘాతం కల్గించడం వీరి లక్ష్యంగా కనబడుతున్నది..  అందరి సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఏ ప్రభుత్వమూ ప్రామాణికమైన మరియు సమగ్రమైన డేటా లేకుండా తన విధానాలను రూపిందించలేదు . 
 *అసత్యలతో , అర్థ సత్యాలతో గగ్గోలు* *పెడుతూ మరో గోబిల్స్ లా* *విపక్షాలు , ఇతరులు  చేస్తున్న  ఈ* *ప్రచారానికి పాల్పడవద్దని*  *నమ్మవద్దని నేను ప్రజలకు విజ్ఞప్తి* *చేస్తున్నాను.*